నవతెలంగాణ – హైదరాబాద్ : మెగా కుటుంబంలో సందడి నెలకొంది. సినీ నటుడు రామ్ చరణ్, ఉపాసన దంపతులకు కవల పిల్లలు జన్మించారు. ఉపాసన ఓ మగ, ఆడ శిశువులకు జన్మనిచ్చినట్లు మెగాస్టార్ చిరంజీవి ఎక్స్ వేదికగా వెల్లడించారు. తల్లీ బిడ్డలు ఆరోగ్యంగా ఉన్నారని, తమ కుటుంబంలోకి కొత్త సభ్యులు రావడం సంతోషం కలిగిస్తోందని చెప్పారు. ఇప్పటికే రామ్ చరణ్ దంపతులకు కుమార్తె క్లింకార ఉన్న సంగతి తెలిసిందే. ఈ వార్తతో మెగా అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. ” రామ్చరణ్-ఉపాసన దంపతులకు శనివారం రాత్రి కవలలు జన్మించారు. దీంతో కొణిదెల, కామినేని కుటుంబాలు సంతోషంగా ఉన్నాయి. ఆ భగవంతుడి దయ, హనుమాన్ కఅపతో ఒక మగబిడ్డ, ఒక ఆడబిడ్డ జన్మించారు. ఉపాసనతో పాటు బిడ్డలిద్దరూ చాలా ఆరోగ్యంగా ఉన్నారు. మా ఇంట శుభం కలగాలని ఎక్కడెక్కడి నుంచో కోరుకున్నారు. ఈ వార్తను మీతో పంచుకుంటున్నందుకు చాలా సంతోషంగా ఉంది. అభిమానులు దీన్ని పండుగలా భావిస్తున్నారు. వారి ఆనందానికి అవధుల్లేవు. అందరికీ ధన్యవాదాలు ” అని చిరంజీవి అన్నారు.
రామ్చరణ్-ఉపాసన దంపతులకు కవలలు జన్మించారు : చిరంజీవి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



