- Advertisement -
నవతెలంగాణ – మద్నూర్ : మద్నూర్ మండలంలోని అవల్ గావ్, గ్రామ మాజీ సర్పంచ్ మారుతి బోండ్ల వార్ , రుక్మిణి దంపతుల తనయుడి విట్టల్, శ్రావణి ల పెళ్ళి వేడుకకు జుక్కల్ మాజీ ఎమ్మెల్యే సౌదాగర్ గంగారాం హాజరై వధు, వరులను అక్షింతలు వేసి ఆశీర్వదించారు. మాజీ ఎమ్మెల్యే కు మాజీ సర్పంచ్ మారుతి శాలువాతో ఘనంగా సత్కరించారు. మాజీ ఎమ్మెల్యే వెంట మద్నూర్ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ నాగనాథ్ పటేల్, మాజీ ఎంపిటీసీ రాయప్ప పటేల్, మాజీ సర్పంచ్ శాంతేశ్వర్ , మాజీ ఎంపిటీసీ సాయిలు కాంగ్రెస్ గ్రామ అధ్యక్షులు ప్రమోద్ పటేల్, వివిధ పార్టీ ల నాయకులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -