- Advertisement -
నవతెలంగాణ – మద్నూర్: బాన్సువాడ ఆర్డీవో గా ఇటీవల నూతనంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మొట్టమొదటిసారిగా డోంగ్లి మండలాన్ని సందర్శించారు. కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించిన ఆర్డిఓ రవీందర్ రెడ్డిని డోంగ్లి మండల కేంద్ర రైతు విన్నవిస్తూ సార్ మా ఇంటికి రండి అంటూ మర్యాదపూర్వకంగా పిలవడంతో రైతు విన్నపన్ని మన్నిస్తు ఇంటికి వెళ్లిన ఆర్డీవో డోంగ్లి, తాసిల్దార్ రంజిత్ కుమార్ కు ఆ రైతు శాలువాలతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఆ రైతు తమ ఆవేదన వ్యక్తం చేశాడు. మాటను విన్నవించి ఇంటికి రావడం మీలో నిజమైన సేవాభావం ఉందని ఆ రైతు సంతోషం వ్యక్తపరిచారు. ఆర్డిఓ తాసిల్దార్ వెంట డోంగ్లి సింగిల్ విండో కార్యదర్శి బాబురావు. పలువురు రైతులు ఉన్నారు.
- Advertisement -


