- Advertisement -
నవతెలంగాణ – మద్నూర్
మద్నూర్ మండలంలోని శాఖాపూర్ గ్రామాన్ని హౌసింగ్ ఏఈ హనుమంత్ బుధవారం సందర్శించి ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాల లబ్ధిదారులకు ఇండ్ల నిర్మాణంలో వాడవలసిన ఇసుక కంకర సిమెంటు సలాక్ ఏ విధమైన వాటిని ఎలా వాడాలనే దానిపై తెలియజేశారు. ప్రభుత్వాన్నిబంధనాల ప్రకారం పనులు జరుపుకుంటే బిల్లులు వెనువెంటనే రావడానికి తాను కృషి చేస్తానని లబ్ధిదారులకు సూచించారు. ఇండ్ల పరిశీలన కార్యక్రమంలో ఆ గ్రామ ఉపసర్పంచ్ ఫక్రుద్దీన్ గ్రామ కార్యదర్శి ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారురాలు నాగమణి తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -



