Monday, June 16, 2025
E-PAPER
Homeజాతీయంమహిళలకు యుద్ధ స్ఫూర్తి లేదు

మహిళలకు యుద్ధ స్ఫూర్తి లేదు

- Advertisement -

– వారు ఉగ్రవాదులతో పోరాడి ఉండాల్సింది
– పహల్గాం ఘటనపై బీజేపీ ఎంపీ కారుకూతలు
– ఆయన వ్యాఖ్యలపై విమర్శల వెల్లువ
భివాని:
మొన్న ఆపరేషన్‌ సిందూర్‌ విషయంలో మధ్యప్రదేశ్‌ మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు మరవకముందే.. అదే పార్టీకి చెందిన ఒక ఎంపీ మహిళలపై కారుకూతలు కూశారు. పహల్గాం ఉగ్రదాడిపై బీజేపీ నాయకులు వరుసగా చేస్తున్న ఇలాంటి వ్యాఖ్యలు ఆ పార్టీ నిజస్వరూపా న్ని బట్టబయలు చేస్తున్నాయి. తాజాగా హర్యానా నుంచి బీజేపీ రాజ్యసభ సభ్యుడు రామ్‌ చంద్రర్‌ జాంగ్రా ఇలాంటి వ్యాఖ్యలే చేశారు. పహల్గాంలో కాల్పుల సమయంలో ఉగ్రవాదులతో మహిళా పర్యాటకులు పోరాడి ఉండాల్సింద నీ, ఉగ్రవాదులు తమ భర్తలను చంపుతున్నప్పు డు వారు ‘ఎలాంటి యుద్ధ స్ఫూర్తినీ ప్రదర్శించలేదు’ అని రామ్‌ చంద్రర్‌ జాంగ్రా వ్యాఖ్యానించారు. అందుకే మహిళలు చేతులు జోడించుకుంటూ వేడుకున్నారని అన్నారు. ఇండోర్‌ రాణి అహల్యాబాయి హోల్కర్‌ జయంతిని పురస్కరించుకుని భివానీలో బీజేపీ ఏర్పాటు చేసిన ఒక కార్యక్రమంలో ఎంపీ ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ కార్యక్రమంలో 75 ఏండ్ల ఎంపీ మాట్లాడుతూ ప్రధాని మోడీ అమలు చేయాలనుకుంటున్న శిక్షణ (అగ్నివీర్‌)ను పర్యాటకులు తీసుకుని ఉండి ఉంటే.. ఉగ్రవాదులు 26 మందిని చంపిఉండేవారు కాదని వ్యాఖ్యానించారు. అలాగే అహల్యాబాయి జీవిత చరిత్రను మహిళలు చదివిఉంటే వారి కండ్ల ముందే వారి భర్తలను ఉగ్రవాదులు చంపి ఉండేవారు కాదని ఎంపీ అన్నారు. మన అద్భుతమైన గతం గురించి మనకు చెప్పలేదనీ, ఒక్క గాంధీ కుటుంబం గురించి మాత్రమే బోధించారని మంత్రి చెప్పారు.
బీజేపీ ఎంపీ వ్యాఖ్యలు సిగ్గుచేటు : కాంగ్రెస్‌
బీజేపీ ఎంపీ చేసిన ఈ వ్యాఖ్యలపై తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఎంపీ వ్యాఖ్యలు సిగ్గు చేటని కాంగ్రెస్‌ నాయకులు జైరాం రమేశ్‌ విమర్శించారు. ”ఇలాంటి సిగ్గు చేటు వ్యాఖ్యలకు ప్రధాని మోడీ క్షమాపణలు చెప్పాలి. ఎంపీ జాంగ్రాను పార్టీ నుంచి బహిష్కరించాలి” అని డిమాండ్‌ చేశారు. ”భారత సైన్యాన్ని, అమరవీరులను బిజెపి నాయకులు నిరంతరం అవమానిస్తున్నారు.
ఇది వారి అల్పమైన, నీచమైన మనస్తత్వాన్ని బహిర్గతం చేస్తుంది. అధికార మత్తులో ఉన్న బీజేపీ చాలా తీవ్రంగా మారిందని వెల్లడిస్తుంది. ఉగ్రవాదుల దాడిలో అమరులైనవారి త్యాగాన్ని గుర్తించకుండా, భద్రతా వైఫల్య లోపాన్ని కప్పిపుచ్చుతూ, బీజేపీ నాయకులు అమరవీరులను, వారి భార్యలను ప్రశ్నిస్తున్నారు. విజరు షా, దేవరా వంటి నాయకులపై బీజేపీ ఇప్పటి వరకూ ఎటువంటి చర్యలూ తీసుకోలేదు. ఇప్పుడు ఈ తాజా వ్యాఖ్యలు చాలా అభ్యంతరకరంగా ఉన్నాయి. ప్రధాని మోడీ, బీజేపీ నాయకత్వం మౌనంగా ఉంటడాన్ని ఈ వ్యాఖ్యలను వారు అమోదిస్తున్నట్టుగానే భావించాలి” అని జైరాం రమేశ్‌ అన్నారు.
తీవ్రంగా ఖండించిన అఖిలేశ్‌ యాదవ్‌
బీజేపీ ఎంపీ వ్యాఖ్యలను సమాజ్‌వాదీ పార్టీ (ఎస్‌పీ) కూడా తీవ్రంగా ఖండించింది. ఉగ్రవాద దాడి బాధితులైన మహిళల గురించి బీజేపీ ఎంపీ చేసిన అసహ్యకరమైన ఈ వ్యాఖ్యలు ఖండించాల్సినవని ఎస్‌పీ అధ్యక్షులు అఖిలేశ్‌ యాదవ్‌ అన్నారు. ”మహిళలను అవమానించడం, వేధించడం, అన్ని విధాలుగా దోపిడీ చేయడం బీజేపీ నిజమైన రూపం. ఇది అసహ్యకరమైనది, చాలా సిగ్గు చేటు. బిజెపి ఒక పార్టీ కాదు, మహిళా వ్యతిరేక మనస్తత్వం కలిగిన సమూహం” అని విమర్శించారు.
‘నా వ్యాఖ్యలను వక్రీకరించారు’
తన వ్యాఖ్యలపై తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లుత్తుతుండటంతో ఎంపీ నాలుగు నిమిషాల వీడియో ఒకటి విడుదల చేశారు. తన వ్యాఖ్యలను వక్రీకరించారని తెలిపారు. తన మాటలతో ఎవరైనా బాధపడి ఉంటే వారికి క్షమాపణలు చెప్పడానికి తనకు ఎలాంటి అభ్యంతరమూ లేదని అన్నారు. చరిత్ర పుస్తకాల్లో బ్రిటిష్‌, మొఘలుల గురించి మాత్రమే చెప్పారని తెలిపారు. అలాగే పర్యాటకులకు అగ్నివీర్‌ శిక్షణ ఇచ్చిఉంటే వారు ఉగ్రవాదులను చుట్టుముట్టు ఉండేవారని ఎంపీ అన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -