- Advertisement -
నవతెలంగాణ – మల్హర్ రావు
మండలంలోని కొయ్యుర్ నూతన ఎస్ఐగా పర్శవెన మహేందర్ కుమార్ ఇటీవల బాధ్యతలు చేపట్టిన విషయం తెలిసిందే. ఆదివారం అఖిల భారత యాదవ సంఘం ఆధ్వర్యంలో ఎస్ఐ మహేందర్ కుమార్ కు బొకే అందజేసి, శాలువాతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఇప్పలపల్లి గ్రామ సర్పంచ్ అబ్బినవేని లింగస్వామి యాదవ్, కాటారం సబ్ డివిజన్ ప్రధాన కార్యదర్శి బోయినీ రాజన్న యాదవ్, మండల గౌరవ అధ్యక్షుడు యాదండ్ల రామన్న యాదవ్, యూత్ అధ్యక్షుడు పంచిక మల్లేష్ యాదవ్, డివిజన్ ముఖ్య సలహాదారుడు పోచంపల్లి కత్తెరసాల యాదవ్, ఇప్పలపల్లి గ్రామ యాదవ సంఘం అధ్యక్షుడు కొడారి మల్లేష్ యాదవ్, తాడిచర్ల గొర్ల మేకల పెంపక దారుల సంఘం అధ్యక్షుడు మెరుగు రాజయ్య యాదవ్ పాల్గొన్నారు.
- Advertisement -



