- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : సిద్దిపేట జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. ఆపరేషన్ వికటించి గర్భిణి మృతి చెందింది. ఈ విషాదకర సంఘటన సిద్దిపేటలోని మానస హాస్పిటల్లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. జిల్లాలోని చిన్న కోడూరుకు చెందిన అశ్విని అనే గర్భిని చికిత్స కోసం మానస హాస్పిటల్ చేరింది. కడుపులో బిడ్డ ఆరోగ్యం బాగా లేదని ఆపరేషన్ చేశారు. తీవ్ర రక్తస్రావం అవడంతో అశ్విని మృతి చెందింది. కాగా, వైద్యుల నిర్లక్ష్యం వల్లే చనిపోయిందని ఆరోస్తూ గర్భిణి కుటుంబ సభ్యులు మృతదేహంతో హాస్పిటల్ ఎదుట ఆందోళనకు దిగారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
- Advertisement -



