Sunday, February 15, 2026
E-PAPER
Homeతాజా వార్తలుజగిత్యాలలో యువకుడు దారుణహత్య

జగిత్యాలలో యువకుడు దారుణహత్య

- Advertisement -

నవతెలంగాణ – జగిత్యాల : జగిత్యాల పట్టణంలో ఓ యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. నడి రోడ్డుపైనే యువకుడిపై కర్రలతో దాడి చేసి ఇద్దరు దుండగులు చంపేశారు. పూర్తి వివరాల ప్రకారం.. అంతర్గాం ఒడ్డెర కాలనీకి చెందిన గంగాధర్ భార్య తనను వదిలేసి.. ఇంస్టాగ్రామ్ లో పరిచయమైన విశ్వనాధ్ అనే వ్యక్తితో ఏడాది కాలంగా సహజీవనం చేస్తోందని తెలుసుకొని.. విశ్వనాధ్ పై దాడి చేసి చంపేశాడు.

విశ్వనాధ్ పోరండ్ల గ్రామానికి చెందినవాడిగా పోలీసులు గుర్తించారు. మేడిపల్లి మండలం పోరుమాలకి చెందిన యువతితో గంగాధర్ కు 12 ఏండ్ల క్రితం వివాహం అయ్యింది. వీరికి ఒక బాబు, పాప ఉన్నారు. కొన్ని కారణాలతో ఏడాది క్రితం భార్యాభర్త విడిపోయి దూరంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో గంగాధర్ భార్య ఏడాది క్రితం ఇన్స్టాగ్రామ్ లో పరిచయమైన విశ్వనాధ్ తో సహజీవనం చేస్తోంది. విషయం తెలుసుకున్న గంగాధర్.. ఇవాళ సాయిబాబా బైపాస్ రోడ్డులో విశ్వనాధ్ పై కర్రతో దాడి చేసి దారుణంగా హత్య చేశాడు. శివరాత్రి రోజున గుడికి వెళ్లి తిరిగి వస్తుండగా.. విశ్వనాధ్ పై దాడి చేసి చంపేశాడు. తీవ్ర గాయాలవడంతో విశ్వనాధ్ అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -