నవతెలంగాణ-రామారెడ్డి
కాంగ్రెస్ పార్టీ జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షులు రాతుల రెడ్డి నాయక్ 45వ పుట్టినరోజు సందర్భంగా ఆదివారం జిల్లా ప్రభుత్వాసుపత్రిలో పండ్లు, జ్యూస్, అల్పాహారంతో పాటు రు 500 రెడ్డి నాయక్ తో పాటు టీపీసీసీ ఎన్ఆర్ఐ పర్వేజ్ అహ్మద్ పలువురు అందజేశారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ.. రెడ్డి నాయక్ ఇలాంటి పుట్టినరోజులు మరిన్ని జరుపుకొని, ఉన్నత పదవులు పొంది, పేద ప్రజలకు సేవ చేయాలని కోరారు. టిపిసిసి ఎన్ఆర్ఐ సెల్ పర్వేజ్ అహ్మద్ విదేశాల్లో తెలుగువారికి ఎలాంటి ఆపద వచ్చినా నేనున్నానని, సొంత డబ్బులతో సమస్యల పరిష్కారంతోపాటు విమాన టికెట్ కొనుగోలు చేసి స్వదేశానికి పంపిస్తున్న ఘనత ఆయనదేనని రాతుల రెడ్డి నాయక్ కొని ఆడారు. కార్యక్రమంలో నాయకులు బి రామచంద్రనాయక్, బాలు నాయక్, బట్టు కృష్ణ నాయక్, బట్టు రవి నాయక్, శ్రీరామ్ నాయక్, వర్షిత్ పర్వాజ్, రంజిత్ గౌడ్, తదితరులు పాల్గొన్నారు.
కాంగ్రెస్ ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుని జన్మదిన వేడుకలు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



