లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
ముంబయి : బ్యాంకింగ్ షేర్లలో కొనుగోళ్ల మద్దతుతో దేశీయ స్టాక్ మార్కెట్లు రెండు రోజుల నష్టాలకు చెక్ పెడుతూ లాభాలతో ముగిశాయి. సోమవారం బిఎస్ఇ సెన్సెక్స్ 650 పాయింట్లు లాభపడి 83,277కు చేరగా.. ఎన్ఎస్ఇ నిఫ్టీ 211 పాయింట్లు పెరిగి 25,682 వద్ద ముగిసింది. ఇదే సమయంలో హిందుస్థాన్ యూనిలీవర్ నుంచి విడిపోయిన ఐస్క్రీమ్ విభాగం క్వాలిటీ వాల్స్ ఇండియా లిమిటెడ్ స్టాక్ మార్కెట్లలోకి ప్రవేశించింది. అయితే ఎన్ఎస్ఇలో సుమారు 26 శాతం డిస్కౌంట్తో రూ.29.80 వద్ద లిస్ట్ అయిన ఈ షేరు.. తుదకు 2.01 శాతం నష్టంతో రూ.29.20 వద్ద ముగిసింది. మార్కెట్ కాపిటల్ రూ.6,880.81గా నమోదయ్యింది. డీమెర్జర్ స్కీమ్ కింద గతేడాది డిసెంబర్ 5 నాటికి హెచ్యుఎల్ షేర్లు ఉన్న ఇన్వెస్టర్లకు 1:1 నిష్పత్తిలో క్వాలిటీ వాల్స్ షేర్లను కేటాయించింది.
డిస్కౌంట్తో క్వాలిటీ వాల్స్ షేర్ల లిస్టింగ్
- Advertisement -
- Advertisement -



