- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : SLBC సొరంగం కూలి ఏడాది కావొస్తున్నా కార్మికుల మృతదేహాలను వెలికితీయడంలో ప్రభుత్వం విఫలమైందని కేటీఆర్ విమర్శించారు. ‘మృతదేహాల వెలికితీతలో, సొరంగం పనుల్లో పురోగతి లేకపోవడం రేవంత్ చేతకానితనానికి నిదర్శనం. కాంగ్రెస్ నేతలు కమీషన్లపై పెట్టే శ్రద్ధ.. ప్రజా శ్రేయస్సుపై పెడితే ఇలాంటి విషాదాలు పునరావృతం కావు’ అని ట్వీట్ చేశారు. 2025 ఫిబ్రవరి 22న జరిగిన ఈ ప్రమాదంలో 8 మంది చనిపోగా, ఇద్దరి మృతదేహాలను వెలికితీశారు.
- Advertisement -



