- Advertisement -
నీరు వృధాగా పోతున్న అధికారుల మాత్రం పట్టింపు కరువు
నవతెలంగాణ – కాటారం
కాటారం మండల కేంద్రంలోని చింతకాని మూల మలుపు వద్ద మిషన్ భగీరథ గేటు వాలు లీకై గత కొన్ని రోజులుగా నీరు నిరంతరం వృథాగా పోతోంది. గ్రామాల్లో తాగునీటి సమస్యలు ఉన్నా, రోడ్డుపై మాత్రం నీరు నదిలా పారుతుండటం చూసి స్థానికులు అధికారుల పైన మండి పడుతున్నారు. “ఇళ్లకు నీరు రావడం లేదు, రోడ్డుకే నదులు వస్తున్నాయి” అని ప్రజలు విమర్శిస్తున్నారు. లీకైన గేటు వాలును పట్టించుకోవాల్సిన అధికారులు మాత్రం నిశ్శబ్దం పాటిస్తున్నారని ప్రజలు ఆరోపణలు చేస్తున్నారు . ఇకనైనా లీక్ను సరిచేసి నీటి వృథాను నివారించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
- Advertisement -



