అడ్డుకుని వెనక్కి పంపిన పోలీసులు
ప్రాణహిత చేవెళ్ల నిర్మాణంపై పరస్పర సవాళ్లు
నవతెలంగాణ-కౌటాల
తుమ్డిహెట్టి వద్ద ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు నిర్మాణం విషయంలో సిర్పూర్ మాజీ ఎమ్మెల్యే కొనేరు కొనప్ప, ప్రస్తుత ఎమ్మెల్యే హరీష్బాబు పరస్పర సవాళ్ల నేపథ్యంలో పోలీసులు వారిని హౌస్ అరెస్టు చేశారు. కాగా బుధవారం కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా తుమ్డిహెట్టికి చేరుకున్న మాజీ ఎమ్మెల్యే, ఎమ్మెల్యే అనుచరులు, పార్టీల నాయకులను పోలీసులు నిలువరించారు. ప్రాజెక్టు వద్దకు వెళ్లకుండా అడ్డుకొని తిరిగి వెనక్కి పంపించారు. ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టును తుమ్డిహెట్టిలో నిర్మాణం చేయకుండా కేసీఆర్ అడ్డుపడి ఈ ప్రాంత రైతులకు తీరని అన్యాయం చేశారని సిర్పూర్ ఎమ్మెల్యే పాలాయి హరీష్బాబు ఆరోపించారు. తుమ్డిహెట్టి వద్ద ప్రాణహిత ప్రాజెక్టు నిర్మాణంపై మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప బహిరంగ చర్చకు రావాలని సవాల్ విసిరారు. ఈ క్రమంలో ఇరువురు పరస్పరం సవాళ్లు విసురుకున్న నేపథ్యంలో వారిని పోలీసులు హౌస్ అరెస్టు చేశారు. అనుచరులను ప్రాజెక్టు వద్దకు వెళ్లకుండా అడ్డుకున్నారు.
తుమ్డిహెట్టికి ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే అనుచరులు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES