నవతెలంగాణ – ఉప్పునుంతల
శ్రీ లక్ష్మీనరసింహ దేవస్థానంలో బ్రహ్మోత్సవాలు ఆదివారం ఘనంగా ప్రారంభమయ్యాయి. ఉత్సవాల్లో భాగంగా నేడు ధ్వజారోహణం కార్యక్రమాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. అనంతరం ఆంజనేయ స్వామికి మూర్తి హోమం నిర్వహించారు. ఈ కార్యక్రమాలు వేద పండితులు రాజయ్య అయ్యగారు, తిరువేంగళం అయ్యగారు ఆధ్వర్యంలో సంప్రదాయబద్ధంగా జరిగాయి. ఆలయ ప్రాంగణం భక్తులతో కిక్కిరిసిపోయింది.
ఈ కార్యక్రమంలో ఉత్సవ కమిటీ చైర్మన్ వేముల నరసింహారావు, సర్పంచ్ ముకురాల మోహన్ గౌడ్, డిప్యూటీ సర్పంచ్ పానం సైదులు, పాలక మండల సభ్యులు బుధగం శ్రీనివాసులు గౌడ్, చలమల గణేష్ గౌడ్, కన్నొజు ప్రదీప్ ప్రసాద్, గ్రామ పెద్దలు అర్జున్ రావు, బాల్ రావు తదితరులు పాల్గొన్నారు.
నేడు జరిగే స్వామివారి కళ్యాణ మహోత్సవానికి డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ దంపతులు, కూచికుళ్ళ రాజేష్ రెడ్డి దంపతులు , మల్లురవి హాజరుకానున్నారు. ప్రజాప్రతినిధుల రాకతో కళ్యాణోత్సవం మరింత వైభవంగా సాగనుంది.



