- Advertisement -
నవతెలంగాణ-మద్నూర్
మద్నూర్ మండల కేంద్రంలోని మద్నూర్ గ్రామపంచాయతీ నూతన భవన నిర్మాణానికి అధికారులు మంగళవారం రెవెన్యూ స్థలం సర్వే చేశారు. ఇందులో భాగంగా ఎస్బీఐ బ్యాంకు ముందు గల స్థలాన్ని సర్వేయర్ వెంకట్, కార్యదర్శి సందీప్ కుమార్ లు కలిసి పరిశీలించారు. అతిత్వరలో ఇక్కడ భూ నూతన గ్రామ పంచాయతీ భవనాన్ని నిర్మించనున్నారు. కార్యక్రమంలో కార్యదర్శి, సర్వేయర్ పాల్గొన్నారు.
- Advertisement -



