టీఎస్ యుటిఎఫ్ జిల్లా కార్యదర్శి గుగులోతు రామకృష్ణ
నవతెలంగాణ – బోనకల్
ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గ పరిధిలోనే బోనకల్ మండల కేంద్రంలో గల కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం (కేజీబీవీ) యు ఆర్ ఎస్ సమగ్ర శిక్ష ఉద్యోగులకు మినిమం బేసిక్ ఇవ్వాలని టీఎస్ యుటిఎఫ్ జిల్లా కార్యదర్శి గుగులోతు రామకృష్ణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. టీఎస్ యుటిఎఫ్ ఆధ్వర్యంలో జరుగుతున్న దశల వారి పోరాట కార్యక్రమంలో భాగంగా సోమవారం సాయంత్రం కేజీబీవీ ఉపాధ్యాయులు డిమాండ్స్ తో కూడిన ప్లకార్డులతో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా టీఎస్ యుటిఎఫ్ జిల్లా కార్యదర్శి గుగులోతు రామకృష్ణ మాట్లాడుతూ కేజీబీవీ ఎస్ఓ లకు ప్రిన్సిపాల్ బేసిక్ పే ఇవ్వాలని, పిజిసిఆర్టి లకు జేఎల్ బేసిక్ పై ఇవ్వాలని, సిఆర్టిలు, సిఆర్పి లకు స్కూల్ అసిస్టెంట్ బేసిక్ పై ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
రాష్ట్ర ప్రభుత్వం గతంలో ఇచ్చిన హామీ మేరకు 29 రోజుల సమ్మె కాలానికి వేతనాలు ఇవ్వాలని, హెల్త్ కార్డులు ఇవ్వాలని, బేసిక్ పే వేతనాల అమలు కోరుకు పిఏబిలో బడ్జెట్ కేటాయింపు చేయాలని కేర్ టేకర్స్ ను నియమించాలని, ఉపాధ్యాయులపై పని ఒత్తిడిని తగ్గించాలని కోరారు. ప్రభుత్వ విద్యారంగా ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం చేయకుండా రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని విమర్శించారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలేనా కూడా అమలు చేయకపోవడం బాధాకరమన్నారు. సమస్యల పరిష్కారం కోసం టీఎస్ యుటిఎఫ్ ఆధ్వర్యంలో దసరా వారి పోరాటాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వం వీరి సమస్యల పరిష్కారం చేసే వరకు దశల వారి పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో టీఎస్ యుటిఎఫ్ మండలాధ్యక్షులు గార్లపాటి చిన్న రంగారావు, సిఆర్పిల సంఘం రాష్ట్ర నాయకులు షేక్ మహబూబ్ పాషా, కేజీబీ ఎస్ఓ ఇస్లావత్ సక్కుబాయి, టీఎస్ యుటిఎఫ్ మండల కోశాధికారి పి నరసింహారావు, మండల ఉపాధ్యక్షులు పి గోపాలరావు, కేజీబివి కన్వీనర్ పి రాణి, సోషల్ మీడియా కన్వీనర్ ఎం నరేంద్ర సింహ, హరికృష్ణ, రేఖం శ్రీనివాసరావు, టి మేరీ రాణి, పి లావణ్య, డి చంద్రకళ, బి నిర్మల, వేమ రత్నకుమారి, కె మరియమ్మ, సుధారాణి, డి సుజాత, యం విజయ కుమారి, ఝాన్సీ, యం మానస తదితరులు పాల్గొన్నారు.



