– అభినందించిన ఉపాధ్యాయులు
నవతెలంగాణ – అశ్వారావుపేట
గత ఏడాది డిసెంబర్ లో నిర్వహించిన గోదావరి తెలుగు ప్రతిభా పరీక్షలో అశ్వారావుపేట కాంప్లెక్సు కు చెందిన పలు పాఠశాలల విద్యార్థులు రాష్ట్రస్థాయి ర్యాంకులు సాధించి ప్రతిభ చాటారు. మంగళవారం విడుదలైన ఫలితాల్లో 5 వ తరగతిలో పేరాయిగూడెం ప్రాధమిక పాఠశాలకు చెందిన నార్లపాటి ఐశ్వర్య, పి.ఎస్ అశ్వారావుపేట కు చెందిన సాయిల లక్కీ ప్రశాంత్ రాష్ట్రస్థాయిలో మొదటి ర్యాంకు సాధించారు.
బి.సి కాలనీ పాఠశాలకు చెందిన జ్ఞానేష్ ద్వితీయ ర్యాంకు పొందాడు. 6 వ తరగతిలో అమీసా ఫాతీమా, 7 వ తరగతిలో కె. మైథిలి మొదటి ర్యాంకులు సాధించగా, కె. తేజారాం చరణ్ మరియు జి.భవ్యశ్రీ లు ద్వితీయ ర్యాంకులు సాధించారు. ఈ సందర్భంగా కాంప్లెక్సు ప్రధానోపాధ్యాయురాలు హరిత మాట్లాడుతూ విద్యార్థుల విజయం పట్ల ఆనందం వ్యక్తం చేసి అభినందించారు.
కార్యక్రమంలో తెలుగు ఉపాధ్యాయులు దుర్గయ్య, పుల్లయ్య, రమాదేవి, గిరిబాబు, హరిబాబు, చలపతిరావు తదితరులు పాల్గొన్నారు.త్వరలో నిర్వహించనున్న అభినందన సభలో విజేతలకు బహుమతులు అందజేయనున్నట్లు సి.ఆర్.పి ప్రభాకరాచార్యులు తెలిపారు.


