Saturday, March 14, 2026
E-PAPER
Homeక్రైమ్మెట్రో స్టేషన్ పై నుంచి దూకి బీటెక్ విద్యార్థి ఆత్మహత్య

మెట్రో స్టేషన్ పై నుంచి దూకి బీటెక్ విద్యార్థి ఆత్మహత్య

- Advertisement -

నవతెలంగాణ – బేగంపేట్
సికింద్రాబాద్ ఈస్ట్ మెట్రో స్టేషన్ పై నుంచి దూకి బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతున్న ఓ విద్యార్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన గోపాలపురం పోలీస్ స్టేషన్ పరిధిలో శుక్రవారం జరిగింది. పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం.. బోడుప్పల్ కు చెందిన రాజేష్ ప్రభుత్వ ఉపాధ్యాయుడు. ఆయనకు ఇద్దరు కుమారులు.. కాగా పెద్ద కుమారుడు నిత్యతేజ(24)  అనురాగ్ యూనివర్శిటీలో బీటెక్ చివరి సంవత్సరం చదువుతున్నాడు. శుక్రవారం సాయంత్రం 4 గంటలకు అమీర్ పేట్ లో స్నేహితుడి దగ్గరకు వెళ్లి వస్తానని ఇంట్లో చెప్పి ఉప్పల్ నుంచి మెట్రో రైల్ లో సికింద్రాబాద్ కు వచ్చాడు. సాయంత్రం 6.10 గంటల ప్రాంతంలో సికింద్రాబాద్  ఈస్ట్ మెట్రో స్టేషన్లో దిగి కొద్దిసేపటి తర్వాత పై నుంచి కిందకు దూకాడు.

వెంటనే స్థానికులు, మెట్రో సిబ్బంది గమనించి గోపాలపురం పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పోలీసులు వచ్చి 108 సహకారంతో గాంధీ ఆస్పత్రికి తరలించారు. అప్పటికే చనిపోయినట్లు వైద్యులు ప్రకటించారు. గోపాలపురం పోలీసులు కేసు నమోదు చేసుకుని ధర్యాప్తు చేపట్టారు. చేతికి పట్టీ ఉండటంతో పోలీసులు పరిశీలించి చూడగా పట్టీ కట్టిన వద్ద గాయం ఉండటంతో గతంలో ఏమైనా ఆత్మహత్యకు యత్నించాడా అనే అనుమానం వ్యక్తం చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని ధర్యాప్తు ప్రారంభించారు. ఆత్మహత్యకు కారణాలు గత కారణాలు ఇంకా తెలియాల్సి ఉందని, త్వరలోనే అన్ని వివరాలు వెల్లడిస్తామని అన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -