- Advertisement -
నవతెలంగాణ-బెజ్జంకి
సికింద్రాబాద్ లోని బేగంపేట కంట్రీ క్లబ్ యందు గురువారం ఆవిర్భావ సభ నిర్వహించి రాష్ట్ర వార్డు సభ్యుల ఫోరం నూతన కార్యవర్గ ఎన్నిక ప్రక్రియ చేపట్టినట్టు వ్యవస్థాపకుడు బొట్ల కార్తీక్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు.నూతన రాష్ట్రాధ్యక్షునిగా బొర్ర సురేశ్ కుమార్,గౌరవాధ్యక్షుడిగా కనకమామిడి విష్ణును ఏకగ్రీవంగా ఎన్నిక చేసినట్టు కార్తీక్ తెలిపారు.వార్డు సభ్యుల ఆత్మగౌరవంతో పాటు గ్రామాలాభివృద్ధిలో తమ వంతు కీలకపాత్ర పోషిస్తామని బొర్ర సురేశ్ కుమార్ ప్రకటనలో తెలిపారు.
- Advertisement -



