నవతెలంగాణ – కామారెడ్డి, బీబీపేట్
బిబిపేట మండలం మాందాపూర్ గ్రామంలో శనివారం శ్రీ పాటిమిది ఆభయ ఆంజనేయ స్వామివారి ఆలయంలో నూతన కార్యవర్గం ఎన్నిక కార్యక్రమం నిర్వహించారు. అధ్యక్షుడిగా చింతకుంట రాకేష్ రెడ్డి, ఉపాధ్యక్షుడిగా కమ్మరి రంజిత్ కుమార్, ప్రధాన కార్యదర్శిగా యాచం నరేందర్, కోశాధికారిగా గంగోళ్ల నరేందర్ రెడ్డి ఎన్నికయ్యారు. డైరెక్టర్లుగా శీలం శేఖర్ రెడ్డి, చింతర్ల శేషారెడ్డి, అనుపాటి మోహన్ రెడ్డి, పందిరి రాజు, నక్క రవి, గొల్ల పెంటయ్య, గజ్వెల్లి నర్సింలు, అంకన్నగారి శ్రీనివాస్ గౌడ్, దాసరి గణేష్, గొర్రె రవి తదితరులు ఎన్నికయ్యారు. ఈ కమిటీకి గౌరవ అధ్యక్షుడిగా చింతకుంట రాజిరెడ్డి (రాఘవులు కుమారుడు)ని గ్రామ ప్రజలు, వివిధ కులసంఘాల పెద్దల సమక్షంలో ఎన్నుకున్నారు.



