– డీసీసీ అధ్యక్షులు ఏలే మల్లికార్జున్ చేతుల మీదుగా అందజేత..
నవతెలంగాణ – జుక్కల్
కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గంలోని జుక్కల్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో, 100% ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాన్ని పూర్తి చేసి గృహప్రవేశం చేసిన లబ్ధిదారులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అందజేస్తున్న గోడ గడియారాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో కామారెడ్డి జిల్లా డీసీసీ అధ్యక్షులు *శ్రీ ఏలే మల్లికార్జున్ గారు* పాల్గొని లబ్ధిదారులకు గోడ గడియారాలను అందజేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా అర్హులైన ప్రతి కుటుంబానికి సొంతింటి కలను నెరవేర్చేందుకు తెలంగాణ ప్రభుత్వం కట్టుబడి ఉందని, ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని తెలిపారు.



