Saturday, March 28, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఉచిత కూరగాయల విత్తనాల పంపిణీతో రైతులకు మేలు: డిఏవో మణి

ఉచిత కూరగాయల విత్తనాల పంపిణీతో రైతులకు మేలు: డిఏవో మణి

- Advertisement -

నవతెలంగాణ – కాటారం 
జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఉద్యానవన శాఖ ఆధ్వర్యంలో రైతులకు ఉచితంగా కూరగాయల విత్తనాలు పంపిణీ చేయనున్నట్లు కాటారం డివిజన్ హార్టికల్చర్ అధికారి మణి తెలిపారు. ఈ నెల 30వ తేదీ సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు కాటారం అంగడి బజార్‌లో ఈ కార్యక్రమం నిర్వహించబడనుందని వెల్లడించారు.

ఈ సందర్భంగా జిల్లా కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆమె, తెలంగాణ ప్రభుత్వం రైతుల కోసం నూతన రకాల విత్తనాలను అందించేందుకు ప్రత్యేక నిధులతో కార్యాచరణ చేపట్టినట్లు పేర్కొన్నారు. రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఆధునిక పద్ధతుల్లో సాగు చేసి అధిక దిగుబడులు, లాభాలు పొందాలని సూచించారు.

కార్యక్రమానికి హాజరయ్యే రైతులు తమ వ్యవసాయ భూమి పట్టా పాసుబుక్, ఆధార్ కార్డు జిరాక్స్ ప్రతులు మరియు ఒక పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో తీసుకుని రావాలని తెలిపారు. విత్తనాలు కేవలం రైతులకు మాత్రమే అందజేయబడతాయని స్పష్టం చేశారు. రైతు సోదరులు ఈ అవకాశాన్ని వినియోగించుకొని తమ వ్యవసాయాన్ని అభివృద్ధి చేసుకోవాలని డిఏవో మణి పిలుపునిచ్చారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -