నవతెలంగాణ-కమ్మర్ పల్లి
మండలంలోని పలు గ్రామాల్లో తహసిల్దార్ గుడిమేల ప్రసాద్ ఆదేశాల మేరకు శనివారం కళ్యాణ లక్ష్మి చెక్కులను పంపిణీ చేసినట్లు మండల రెవెన్యూ అధికారి శరత్ తెలిపారు. ఉప్లూర్ లో ఏడుగురు లబ్ధిదారులకు, రాజరాజేశ్వరి నగర్ లో ఒకరికి, నాగాపూర్ లో ఇద్దరు లబ్ధిదారులకు, కమ్మర్ పల్లి లో ఏడుగురు లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మి చెక్కులను ఆయా గ్రామాల సర్పంచుల ఆధ్వర్యంలో పంపిణీ చేసినట్లు ఆయన తెలిపారు. కళ్యాణ లక్ష్మి చెక్కులను అందుకున్న లబ్ధిదారులు ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచులు ఎనుగందుల శైలేందర్, తైద సుశీల సాయన్న, కంపదండి అశోక్, కొత్తపల్లి హారికా అశోక్, ఆయా గ్రామాల ఉప సర్పంచులు, వార్డు సభ్యులు, పంచాయతీ కార్యదర్శులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.
పలు గ్రామాల్లో కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



