Sunday, August 9, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్బాధిత కుటుంబాన్ని పరామర్శించిన టీజి ఎండిసి చైర్మన్

బాధిత కుటుంబాన్ని పరామర్శించిన టీజి ఎండిసి చైర్మన్

- Advertisement -

నవతెలంగాణ-బాల్కొండ 
మండల పరిధిలోని నాగపూర్ గ్రామానికి చెందిన మాజీ ఎంపీటీసీ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు చిట్యాల శ్రీనివాస్ యొక్క తండ్రి గంగారాం ఇటీవల మరణించారు. ఈ సందర్భంగా ఆదివారం కాంగ్రెస్ పార్టీ నాయకులు టీ జి ఎం డి సి చైర్మన్ ఈరవత్రి అనిల్ వారి నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు, ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. వారి ఆత్మకి శాంతి కలగాలని కోరారు. కుటుంబ సభ్యులకు మనోధైర్యాని ప్రసాదించాలని కోరారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ బాల్కొండ మండల అధ్యక్షులు సట్ల గంగా ప్రవీణ్ , మాజీ అధ్యక్షులు వెంకటేష్ గౌడ్ , సర్పంచ్ ఫోరం మండల అధ్యక్షులు, జలాల్ పూర్ సర్పంచ్ మోహన్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -