Sunday, August 16, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్హాస్టల్ సేవలకు దక్కిన ప్రశంస పత్రం

హాస్టల్ సేవలకు దక్కిన ప్రశంస పత్రం

- Advertisement -

నవతెలంగాణ – నర్సింహులపేట: నర్సింహులపేట మండల కేంద్రంలోని బీసీ హాస్టల్ లో కుక్ గా పనిచేస్తున్న ఫైండ్ల మల్లయ్యకు 80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా శనివారం ప్రభుత్వ విప్ డాక్టర్ రామచంద్రు నాయక్, జిల్లా కలెక్టర్ స్నేహ శబరిష్ చేతుల మీదుగా ఉత్తమ సిబ్బందిగా ప్రశంస పత్రం అందుకున్నారు. మల్లయ్య 1986 నుంచి పార్ట్ టైం కుక్ గా చేరారు. 1996లో హాస్టల్ లో రెగ్యులర్ సిబ్బంది అయ్యారు. 29 ఏళ్ల నుంచి అంకితభావంతో విద్యార్థులకు రుచికరమైన భోజనం అందిస్తున్నారు. ఈయన సేవలకు గాను ఉత్తమ కుక్ గా ప్రశంస పత్రం అందుకోవడంతో అధికారులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. మల్లయ్య అవార్డు అందుకోవడంతో నర్సింహులపేట మండల ప్రజలు, సహచర ఉద్యోగులు హర్షం వ్యక్తం చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -