- Advertisement -
నవతెలంగాణ – జుక్కల్: మండలంలోని జుక్కల్ చౌరస్తాలో జరిగిన బస్సు ప్రమాదంలో గాయపడిన వారిని మాజీ ఎమ్మెల్యే హన్మంత్ షిండే శుక్రవారం బిచ్కుంద ప్రభుత్వ ఆసుపత్రిలో పరామర్శించారు. చికిత్స పొందుతున్న బాధితులను కలిసి వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. బస్సు డ్రైవర్ మృతి చెందడం పట్ల హన్మంత్ షిండే తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుడి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని వైద్య సిబ్బందిని కోరారు.
- Advertisement -



