Saturday, June 7, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్అర్హులకు అందని ఇందిరమ్మ ఇండ్లు ..

అర్హులకు అందని ఇందిరమ్మ ఇండ్లు ..

- Advertisement -

నిరసన తెలియజేసిన మహిళా సంఘాలు.. 
ఎంపీడీవో కు వినతి పత్రం ఇచ్చిన యూత్ నాయకులు 
నవతెలంగాణ – తాడ్వాయి 
: ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఇందిరమ్మ ఇండ్లు అర్హులైన పేదలకు అందడం లేదని, నార్లాపూర్ గ్రామ ప్రజలు, మహిళా సంఘాల నేతలు, యూత్ నాయకులు బుధవారం ఆందోళన చేశారు. “ఇందిరమ్మ ఇండ్ల జాబితాలో భారీ అవకతవకలు, పైసల్ ఇచ్చినోళ్లకే ఇందిరమ్మ ఇల్లు, డబ్బులు ఇచ్చిన వారికి ఇండ్ల పట్టాలు ఇస్తామంటున్న కాంగ్రెస్ నాయకులు” అనే బ్యానర్ తో నార్లాపూర్ గ్రామపంచాయతీ ముందు పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం నిర్వహించారు. అనంతరం పంచాయతీ కార్యదర్శికి, అన్హరులకు ఇండ్లు ఇచ్చారని, అవి క్యాన్సల్ చేసి మళ్లీ క్షేత్రస్థాయిలో ఉన్నత స్థాయి అధికారులు పరిశీలించి పేదలకు ఇందిరమ్మ ఇళ్లు ఇవ్వాలని వినతిపత్రం అందజేశారు. అనంతరం యూత్ నాయకులు మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయానికి వచ్చి, ఎంపీడీవో సుమన వాణి కి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇండ్లు లేని వారు ఆశతో ఎదురు చూస్తుంటే, ఇప్పటికే ఇండ్లున్నవారికి మళ్లీ ఇండ్లు రావడం ఎంత వరకు న్యాయమో అని ప్రశ్నించారు. మంత్రిగారు నిరుపేదలకే మొదటి ప్రాధాన్యత ఇస్తామని పదేపదే చెప్పారని, కానీ ఇండ్లున్నవారికి, పొలాలు ఉన్నవారికి, అన్హరులకు ఇండ్లు వచ్చాయని వారు మండిపడ్డారు. శిథిలావస్థలో ఉన్న ఇండ్లలో ఉంటూ అనేక కుటుంబాల వారు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. అర్హులను అణగదొక్కి వారి అనుచరులకు, డబ్బులు ఇచ్చిన వాళ్ళకు ఇందిరమ్మ ఇండ్లు వచ్చాయని ఆవేదన చెందారు. ఇందుకు “కాంగ్రెస్ కార్యకర్తలు సభ్యులుగా ఉన్న ఇందిరమ్మ కమిటీ”లు సంపూర్ణంగా సహకరించాయన్నారు. జిల్లా కలెక్టర్ స్పందించి ఇందిరమ్మ ఇండ్లపై క్షేత్రస్థాయిలో పరిశీలించి ఇల్లు లేని వారికి ఇండ్లు మంజూరు చేయాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బోధ చంద్రకళ, గోగుల రవళి, ముదంగుల పద్మ, ఇరుప భాగ్య, యువజన సంఘం అధ్యక్షులు రాధారపు కిరణ్, ఊకే సతీష్, చెర్ప ఆదిలక్ష్మి, వడ్డేపల్లి అనిల్ రెడ్డి, నవీన్ రెడ్డి, మహిళా సంఘాల నాయకురాడ్లు, యువజన సంఘం నాయకులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. కాగా మండల వ్యాప్తంగా అన్ని గ్రామ పంచాయతీలలో ఇంద్రమ్మ ఇండ్ల పంపిణీలో భారీగా అవకతవకలు జరిగాయని గ్రామ ప్రజలు సోషల్ మీడియా వేదికగా ఆందోళన వ్యక్తం చేశారు. మండల స్థాయిలో పునపరిచిన చేయాలని మండలంలోని పేదవారు కలెక్టర్ను కోరుకుంటున్నారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -