Monday, August 18, 2025
E-PAPER
spot_img
Homeతెలంగాణ రౌండప్ఎమ్మార్పీ ధరలకే అమ్మకాలు చేపట్టాలి: ఏవో 

ఎమ్మార్పీ ధరలకే అమ్మకాలు చేపట్టాలి: ఏవో 

- Advertisement -

నవతెలంగాణ – మద్నూర్ 
ఎరువుల దుకాణదారులు రైతులకు అమ్మే ఎరువులు ఎమ్మార్పీ ధరలకే అమ్మాలని అధిక ధరలతో అమ్మితే చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయని మద్నూర్ మండల వ్యవసాయ అధికారి రాజు హెచ్చరికలు జారీ చేశారు. గురువారం నాడు మద్నూర్ మండలంలో మద్నూర్ సొసైటీ మరియు పలు ఎరువుల దుకాణాలను ఆయన తనిఖీ చేయడం జరిగింది.  సొసైటీ యందు  యూరియా మరియు డి ఏ పి అందుబాటులో ఉన్నాయని వ్యవసాయ రైతులు అవసరమైన ఎరువులు సొసైటీ నుండి తీసుకువెళ్లాలని సూచించారు. అలాగే ప్రైవేటు ఎరువుల వ్యాపారులు ఎరువులను ఎమ్మార్పీ ధరకే అమ్మాలని హెచ్చరించడం జరిగింది.  వచ్చిన స్టాక్ ఎప్పటికప్పుడు వ్యవసాయ అధికారినీ తెలియజేయాలి,  రోజు వారి స్టాక్ ఎంత ఉందో స్టాక్ బోర్డ్  పెట్టాలి. ఈపాస్ ద్వారానే రైతులకు అమ్మాలి.రైతులు స్పీక్ డి ఏ పి కాకుండా అన్ని డి ఏ పి లను తీసుకోవాలని అన్ని డి ఏ పి లలో 18.46.0 నే ఉంటుంది కావున రైతులు గమనించి అన్ని కంపెనీల ఎరువులను తీసుకోవాలని సూచన చేయడం జరిగింది. 

ఈ కార్యక్రమంలో సొసైటీ సీఈఓ బాబు పటేల్ సింగిల్ విండో సొసైటీ డైరెక్టర్లు, రైతులు, డీలర్లు పాల్గొన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad