నవతెలంగాణ – న్యూఢిల్లీ: ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఆరోగ్యం క్షీణిస్తున్నదని ఆయన భార్య సునితా కేజ్రీవాల్ తెలిపారు. ప్రస్తుతం ఈడీ కస్టడీలో కేజ్రీ ఉన్న విషయం తెలిసిందే. మరో నాలుగు రోజుల పాటు ఈడీ కస్టడీని పొడిగించారు. ఆ ప్రకటన రావడానికి కొన్ని క్షణాల ముందు ఆమె ఈ విషయాన్ని తెలిపారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం బాగాలేదని, మన సీఎంను వేధిస్తున్నారని, ప్రజలు దీనికి తగిన సమాధానం ఇస్తారని సునితా కేజ్రీవాల్ అన్నారు. రౌజ్ ఎవన్యూ కోర్టు ప్రాంగణంలో ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. మార్చి 21వ తేదీన మద్యం పాలసీ కేసులో కేజ్రీవాల్ను అరెస్టు చేశారు. తొలుత మార్చి 28వ తేదీ వరకు రిమాండ్కు పంపారు. ఇవాళ మళ్లీ ఆ కస్టడీని ఏప్రిల్ ఒకటో తేదీ వరకు పొడిగించారు.