జాతీయ స్థాయి సబ్ జూనియర్ సాఫ్ట్ బాల్  పోటీలకు సంహిత ఎంపిక…

నవతెలంగాణ – డిచ్ పల్లి
డిచ్ పల్లి మండలం లోని ధర్మారం బి సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల, కళాశాల కు చెందిన విద్యార్థిని సంహిత ను గురువారం ప్రిన్సిపల్ సంగీత అభినందించారు. ఈనెల రాష్ట్ర స్థాయి పోటీలలో మంచి ప్రతిభను కనబరిచి విజయానికి ముఖ్య పాత్ర పోషించరని పేర్కొన్నారు. జాతీయస్థాయికి 29 నుండి 1 వరకు మహారాష్ట్రలో నిర్వహించే సబ్ జూనియర్ సాఫ్ట్బాల్ పోటీలలో పాల్గొంటుందని స్కూల్ ఫిజికల్ డైరెక్టర్ నిరాజా రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో పిఈటీ జోష్ణ, పాఠశాల సిబ్బంది పాల్గొని అభినందించారు.
Spread the love