Wednesday, June 18, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్నీటిని విడుదల చేయాలని ఎంపీని కలిసిన రైతులు

నీటిని విడుదల చేయాలని ఎంపీని కలిసిన రైతులు

- Advertisement -

నవతెలంగాణ – తొగుట : పైపుల ద్వారా చెరువులను నింపే విధంగా చర్యలు తీసుకుంటామని ఎంపీ మాధవనేని రఘునందన్ రావు అన్నా రు. సోమవారం రాత్రి మండలంలోని పలు గ్రామాల ఘనాపూర్, గుడికందుల, గోవర్ధన గిరి, వరదరాజు పల్లి, పద్మనాభుని పల్లె, తిమ్మా పూర్, అందే, బుస్సపూర్, ఇర్కోడు గ్రామాల రైతులు మెదక్ ఎంపీ ను కలిశారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ.. మల్లన్న సాగర్ కీ సంబంధిం చిన, ఇర్కోడ్ కెనాల్ పైపులైన్ 80% పూర్తి అయి నప్పటికీ ఇంకా 20% పూర్తి కావాల్సి ఉందన్నారు. పైపుల ద్వారా వచ్చే నీరుని భూమి సేద్యానికి ఉపయోగించడానికి వీలులేకుండా ఉండడం వల్ల ఎలాంటి ఉపయోగం లేదని అవేదన వ్యక్తం చేశా రు. ఈ పైప్ లైన్ ద్వారా అన్ని గ్రామాల చెరువుల కు నీటిని విడుదల చేయడం ద్వారా రైతులకు ఉపయోగం ఉంటుందని ఎంపీకి తెలిపారు. వెంటనే స్పందించి ఎంపీ మాట్లాడుతూ.. పైపుల ద్వారా చెరువులను నింపుటకు మల్లన్న సాగర్ ఈఈ తో మాట్లాడుతామని చెప్పారు. ఇందు కోసం అన్ని గ్రామాల రైతుల సమావేశం ఏర్పాటు చేసి తక్షణమే నీటిని విడుదల చేసి చెరువులను నింపే విధంగా చర్యలు తీసుకుంటామని ఎంపీ హామీ ఇచ్చారని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ సిద్దిపేట జిల్లా ప్రధాన కార్యదర్శి బూరెడ్డి గారి విభీషణ్ రెడ్డి, వరదరాజు పల్లి లక్ష్మణ్ తోపాటు మరికొంత మంది రైతులు, అలాగే బిజెపి జిల్లా నాయకులు, గుడి కందుల గ్రామ మాజీ ఉప సర్పంచ్ ముల్లుగారి శ్రీకాంత్ రెడ్డి, ఐలిగొండ చంద్రశేఖర్ గౌడ్, కొండా పూర్ సర్పంచు రాజు, వివిధ గ్రామాల రైతులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -