కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకుని ఘనంగా జన్మదిన వేడుక
కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి కాసం లక్ష్మారెడ్డి
నవతెలంగాణ – నెల్లికుదురు : ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న పేద విద్యార్థులకు వారి విద్యాభివృద్ధి కోసం ప్రతి ఒక్కరం కృషి చేయాలని కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి కాసు లక్ష్మారెడ్డి జిల్లా నాయకుడు ఆకుతోట సతీష్ అన్నారు. కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకుడు ఆకుతోట సతీష్ జన్మదిన సందర్భంగా మండలంలోని రామన్నగూడెం నెల్లికుదురు ప్రభుత్వ పాఠశాల చదువుతున్న విద్యార్థులకు మంగళవారం నోటు బుక్కులు స్టేషనరీ పిల్లల కోసం షూస్ కోసం కొంత ఆర్థిక సహాయాన్ని అందించే కార్యక్రమాన్ని నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకుడు ఆకుతోట సతీష్ జన్మదిన వేడుకను పురస్కరించుకొని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కేక్ కట్ చేసి మిఠాయిలు పంచుకొని సంబరాలు నిర్వహించారు అనంతరం పండ్లను పంపిణీ చేశారు. మరియు ప్రభుత్వ పాఠశాల చదువుతున్న విద్యార్థులందరికీ ప్రతి ఒక్కరికి నోటుబుక్కులు పెన్సిళ్లు స్టేషనరీ సామాన్లు వారి సొంత ఖర్చులతో అందించామని మరియు వారికి షూస్ కూడా కొంత ఆర్థిక సహాయాన్ని పాఠశాలకు అందించామని తెలిపారు. ఇలాంటి కార్యక్రమాలు చేయడం ఎంతో సంతోషంగా ఉందని కార్యకర్తలు హర్షవర్ధన్ ప్రకటించారు. రాబోయే రోజుల్లో మండలంలోని అన్ని గ్రామాలలో నా వంతు సహాయ సహకారం అందిస్తామని చెప్పారు. తను రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుండి ఎంతోమంది పేదలను ఆదుకున్నామని, ఆపదలో ఉన్న వారికి ఆర్థిక సహాయాన్ని కూడా అందిస్తున్నామని, ఎవరికి ఏ ఆపద వచ్చినా అందుబాటులో ఉంటూ వారికి నా అండదండలు ఎప్పటికి అందిస్తానని ఈ సందర్భంగా వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆ పార్టీ సీనియర్ నాయకులు రావుల సతీష్, జిల్లా వెంకటేష్, మద్ది రాజేష్, జంగా వంశీ ,దొంతుల శ్రీకాంత్, కొంపెల్లి శ్రీశైలం, వెన్నం క్రాంతి, ఎట్టే దేవేందర్ రెడ్డి, తోట నవీన్, కుమ్మరి కుంట్ల మౌనేందర్, చెన్న బోయిన శ్రీనివాస్, జిలకర యాలాద్రి, తోపాటు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు.
పేద పిల్లల విద్యాభివృద్ధి కోసం కృషి చేద్దాం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES