Saturday, August 23, 2025
E-PAPER
spot_img
Homeతెలంగాణ రౌండప్ఇందిరమ్మ గృహాల లబ్ధిదారులతో సమావేశం

ఇందిరమ్మ గృహాల లబ్ధిదారులతో సమావేశం

- Advertisement -

నవతెలంగాణ – కమ్మర్ పల్లి : మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీ కార్యాలయంలో శుక్రవారం ఇందిరమ్మ కమిటీ సభ్యులు, ఇందిరమ్మ గృహాల లబ్ధిదారులతో అవగాహన సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎంపీడీవో చింత రాజ శ్రీనివాస్ ముఖ్యఅతిథిగా హాజరై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇందిరమ్మ ఇండ్లు మంజూరై ఇప్పటివరకు మార్కౌట్ ఇవ్వని లబ్ధిదారులు త్వరగా మార్కౌట్ చేయించుకోవాలన్నారు. ఇప్పటికే మార్కౌట్ పూర్తయిన లబ్ధిదారులు వెంటనే ఇండ్ల నిర్మాణం  పనులు చేపట్టాలని సూచించారు. లబ్ధిదారులు వేగంగా ఇండ్ల నిర్మాణాలను ప్రారంభించుకొని సోమవారంలోగా బేస్మెంట్ వరకు పనులు పూర్తి చేసుకోవాలన్నారు. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి  ఇసుక, మొరం కావలసినవారికి తక్షణమే సంబంధిత తహసిల్దార్  ద్వారా అనుమతులు ఇప్పించడం జరుగుతుందన్నారు. ఇందిరమ్మ ఇల్లు మంజూరైన లబ్ధిదారులు ఇండ్ల నిర్మాణాలను త్వరగా చేపట్టాలని ఈ సందర్భంగా ఎంపీడీవో కోరారు.ఈ అవగాహన సమావేశంలో పంచాయతీ కార్యదర్శి గంగాజమున, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు సుంకేట రవి, నాయకులు నూకల బుచ్చి మల్లయ్య, నిమ్మ రాజేంద్రప్రసాద్, ఇందిరమ్మ కమిటీ సభ్యులు,  తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad