– కాషాయ పార్టీ పట్ల ప్రజల్లో విముఖత : ప్రియాంక గాంధీ
పటియాలా : లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి సానుకూల వాతావరణం ఉందని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ అన్నారు. ప్రచారం కోసం తాను ఏ ప్రాంతానికి వెళ్లినా, ప్రజల నుంచి మెరుగైన స్పందన లభిస్తోందని హర్షం వ్యక్తం చేశారు. విలేకరులతో ఆమె మాట్లాడుతూ కాంగ్రెస్ నేతలకు ప్రజలు బ్రహ్మరథం పడుతుండటం తాను గమనించానన్నారు. బీజేపీ పాలన పట్ల విసిగి వేసారిన ప్రజలు కాంగ్రెస్ పార్టీ నేతలు నిజాయితీతో పనిచేయాలని కోరుకుంటున్నట్టు ఆమె వెల్లడించారు.