- Advertisement -
నవతెలంగాణ – మద్నూర్ : మద్నూర్ మండల కేంద్రానికి చెందిన హోంగార్డ్ బండి వార్ గోవింద్ చేయూతనిస్తూ ప్రతి సంవత్సరం పాఠశాలల విద్యార్థిని విద్యార్థులకు అలాగే అంగన్వాడి పిల్లలకు మండల కేంద్రంలోని పోచమ్మ గల్లి పాఠశాల, రథం గల్లి పాఠశాల అలాగే అంగన్వాడి పిల్లలకు నోట్ బుక్స్, పెన్ను ,పెన్సిల్ ,రబ్బర్, షాప్నర్, స్కేల్, మరియు పలకలు పంపిణీ చేశారు. ఈ విధంగా, గత పది సంవత్సరాల నుండి ఇట్టి కార్యక్రమాన్ని చేపడుతూ వస్తున్నారు. హోంగార్డు అందించే సేవలకు ఆయా పాఠశాలలు ఉపాధ్యాయులు అంగన్వాడి టీచర్లు విద్యార్థిని విద్యార్థుల తల్లిదండ్రులు హోంగార్డు సేవలకు అభినందించారు .
- Advertisement -