No menu items!
Sunday, August 24, 2025
E-PAPER
spot_img
No menu items!
Homeతెలంగాణ రౌండప్ట్రైన్ లో సెల్ ఫోన్ ల చోరీకి పాల్పడుతున్న వ్యక్తి అరెస్ట్ 

ట్రైన్ లో సెల్ ఫోన్ ల చోరీకి పాల్పడుతున్న వ్యక్తి అరెస్ట్ 

- Advertisement -

నవతెలంగాణ- కంఠేశ్వర్ : నగరంలోని రైల్వే పోలీస్ స్టేషన్ పరిధిలో ట్రైన్ లో సెల్ ఫోన్ లను చోరీకి పాల్పడుతున్న వ్యక్తిని అరెస్టు చేసినట్లు రైల్వే ఎస్సై సాయి రెడ్డి తెలిపారు. ఈ మేరకు శనివారం నగరంలోని రైల్వే పోలీస్ స్టేషన్ ఆవరణంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. శనివారం ఉదయం 10:30 గంటల సమయమున డ్యూటీ లో ఉన్న సీబ్బంది ఒకటవ ప్లాట్ ఫార్మ్ మీద విధులు నిర్వస్తుండగా ఒక వ్యక్తి అనుమానాస్పదంగా అటు ఇటు తిరుగుతు కన్పించడం తో తమ సిబ్బందికి అనుమానం వచ్చి అతనిని పట్టుకొని తమదైన శైలిలో విచారణ చేశారు.

విచారణలో నగరంలోని ద్వారకా నగర్ కు చెందిన సయ్యద్ మాజీద్ తేలుపుతూ అతనివద్ద ఉన్న 3 మొబైల్ ఫోన్లు ట్రైనలలో దొంగ తనం చేసినవి అని చూపించి మరల ట్రైన్ లో దొంగ తనానికి వచ్చినను అని తెలియజేశారన్నారు. అలాగే దొరికిన సెల్ ఫోన్స్ యొక్క ఐఎంఈఐ నెంబర్ లను పరిశీలించగా ఆ మొబైల్ ఫోన్లు క్రైమ్ నెంబర్ 120/2025, అండర్/సెక్షన్ 303(2) బి.ఎన్.ఎస్, క్రైమ్ నంబర్  121/2025, అండర్/సెక్షన్ 303(2) బి ఎల్ ఎస్ ఆఫ్ ఆర్ పి ఎస్ నిజామాబాద్ వి అని తెలిపారు. ఇవి ఎక్కడివి అని అడుగగా అట్టి వ్యక్తి వీటిని తేది 19.06.2025 రోజున నాగర్సోల్, షిర్డి సాయినగర్ ట్రైన్ లలో దొంగతనం చేసినాను అని తెలిపారని తెలియజేశారు. సయ్యద్ మజీద్ అను వ్యక్తిని అరెస్ట్ చేసి శనివారం కోర్టు లో హాజరు పరిచి రిమాండ్కు తరలిస్తున్నామన్నారు. ఇతనిని గమనించి చాక చక్యంగా పట్టుకునున్న సిబ్బంది అయినా సురేందర్ హెడ్ కాన్స్టేబుల్, గురూదాస్, రాములు కాన్స్టేబుల్  ను అభినందించారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad