Thursday, June 26, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్రిపోర్టర్ పై దాడి హేయమైన చర్య: మాజీ జెడ్పీటీసీ

రిపోర్టర్ పై దాడి హేయమైన చర్య: మాజీ జెడ్పీటీసీ

- Advertisement -

మండల కేంద్రంలో ప్రెస్ మీట్ లో వెల్లడి
నవతెలంగాణ – తాడ్వాయి 
: ఇందిరమ్మ ఇండ్ల వ్యవహారంలో అవకతవకలు జరిగాయని ఆంధ్రజ్యోతిలో వార్త రాసినందుకు కాంగ్రెస్ నాయకులు జీర్ణించుకోలేక, ఆంధ్రజ్యోతి విలేఖరి శ్రీకాంత్ రెడ్డి పై దాడి చేయడం హేయమైన చర్య అని బిఆర్ ఎస్ సీనియర్ నాయకులు, మాజీ జడ్పిటిసి రామ సహాయం శ్రీనివాసరెడ్డి అన్నారు. బుధవారం మండల కేంద్రంలో అత్యవసరంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ జర్నలిస్టులపై దాడులు చేయడం సిగ్గుమాలిన చర్య భావిస్తున్నామని ఈ దాడికి పాల్పడిన వ్యక్తులను వెంటనే శిక్షించాలని ఆయన కోరారు. సీతక్క గురించి వార్తలు రాస్తావ్ అంటూ ఆంధ్ర జ్యోతి రిపోర్టర్ ను కొట్టిన కాంగ్రెస్ నాయకుల పై పోలీసులు తక్షణమే చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. ప్రజాస్వామ్యంలో ప్రజల గొంతుకైనా పత్రికల గొంతు నొక్కడం ఎంతవరకు కరెక్ట్ అని డిమాండ్ చేశారు. ప్రజల తరఫున ప్రశ్నించే విలేకరులపై దాడి సిగ్గుచేటు అని అన్నారు. అధికారంలో ఉండి ప్రతిపక్షాలను గొంతు నొక్కాలని చూస్తున్న కాంగ్రెస్ నాయకులు సమాజంలో జరుగుతున్న అవకతవుకొలను లోపాలను వెలికి తీసే జర్నలిస్టుపై దాడులు చేయడం హేయమైన చర్య అని మండిపడ్డారు. ప్రజలు అన్ని గమనిస్తున్నారని రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీకి తగిన గుణపాఠం చెప్తారని అని అన్నారు.

మంత్రి సీతక్క నియోజకవర్గంలో కాంగ్రెస్ నాయకులు ప్రశ్నించే జర్నలిస్టులపై దాడులు చేయడం సిగ్గుచేటు అని అన్నారు. టిఆర్ఎస్ ప్రభుత్వంలో జర్నలిస్టులకు ఎంతో స్వేచ్ఛ ఉండేదని, తగిన గుర్తింపు కూడా ఇచ్చామని జర్నలిస్టులను అన్ని రకాల ఆదుకున్నామని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ మండలాధ్యక్షులు దండగల మల్లయ్య, మాజీ సర్పంచులు జాజ చంద్రం, మేడిశెట్టి నరసింహయ్య, మాజీ ఎంపిటిసి దానకర్ నర్సింగరావు, నాయకులు కొండూరి నరేష్, సాయిరి లక్ష్మీనరసయ్య, పిఎసిఎస్ వైస్ చైర్మన్ ఇందారపు లాలయ్య మండల మహిళా అధ్యక్షురాలు సోమ నాగమ్మ, గ్రామ కమిటీ అధ్యక్షులు కొర్నెబెల్లి శేషగిరి, దాయి రోశయ్య,  నాయకులు గండు బిక్షపతి న్యూశెట్టి లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -