Friday, June 27, 2025
E-PAPER
Homeమెదక్డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణంలో భాగస్వాములమవుదాం

డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణంలో భాగస్వాములమవుదాం

- Advertisement -
  • తొగుట సిఐ షేక్ లతీఫ్. 

నవతెలంగాణ- రాయపోల్ : గంజాయి డ్రగ్స్ ఇతర మత్తు పదార్థాల రహిత సమాజ నిర్మాణంలో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టే సంకల్పంలో మనమందరం భాగస్వాములవుదామని తొగుట సిఐ షేక్ లతీఫ్ అన్నారు.గురువారం అంతర్జాతీయ మాదకద్రవ్యాల నివారణ దినోత్సవం సందర్భంగా రాయపోల్ మండల కేంద్రంలో విద్యార్థుల చేత ర్యాలీ నిర్వహించి, మానవహారం నిర్వహించారు. జూన్ 26 న అంతర్జాతీయ డ్రగ్స్ దుర్వినియోగ, అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం సందర్భంగా విద్యార్థులకు మాదక ద్రవ్యాల వినియోగం, రవాణా తదనంతర పరిణామాల గురించి అవగాహన కల్పించారు. ప్రస్తుత సమాజంలో యువత డ్రగ్స్ పట్ల ఆకర్షితులవుతూ శారీరకంగా అనారోగ్యానికి గురవుతున్నారు. కొంతమందిలో  మానసికంగా మార్పులు జరిగి విచక్షణ కోల్పోయి దొంగతనం, హత్యలు, హత్యాచారం, ఇతరులపై దాడికి దిగటం వంటి చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతూ జైలు పాలు అవుతున్నారు.అటువంటి వ్యక్తులు  కుటుంబానికి సమాజానికి అత్యంత ప్రమాదకరం. కావున రాబోవు తరం చెడు వ్యసనాల బారినపడి సమాజ విగ్రహాలుగా కాకూడదంటే విద్యార్థి దశ నుండే మాదక ద్రవ్యాల పట్ల అవగాహన కలిగి ఉండటం అవసరమన్నారు. అంతేకాకుండా కల్తీ కళ్ళు, గంజాయి వంటి వాడకం సమాజంలో విరివిగా ఉన్న నేపథ్యంలో పిల్లలు తమ చుట్టుపక్కల ఉన్న బంధువులు, స్నేహితులు కుటుంబ సభ్యులలో ఎవరికైనా ఇలాంటి చెడు అలవాట్లు ఉంటే, వాటి వలన ఎదుర్కొని పరిణామాలను  తెలుపాలని సూచించారు. గ్రామాలలో ఎవరైనా గంజాయి,ఇతర మాదకద్రవ్యాలైన సేవించేవారు ఉంటే వారి సమాచారాన్ని టోల్ ఫ్రీ నెంబర్ 1908 లేదా 100 కు ఫోన్ చేసి తెలిపాలని సమాచారం ఇవ్వాలన్నారు. ఇచ్చిన వ్యక్తుల వివరాలు గోప్యంగా ఉంచబడుతాయన్నారు.మాదకద్రవ్యాల వినియోగానికి వ్యతిరేకంగా ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో రాయపోల్ ఎస్ఐ రఘుపతి, పాఠశాల ప్రధానోపాధ్యాయులు నాగరాజు, కేజీబీవీ, ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు, పోలీస్ సిబ్బంది, విద్యార్థులు, యువకులు తదితరులు పాల్గొన్నారు

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -