టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షులు జగ్గారెడ్డి
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
ఈ మూడేండ్లు ముఖ్యమంత్రిగా రేవంత్రెడ్డే ఉంటారని టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షులు జగ్గారెడ్డి అన్నారు. వచ్చే ఐదేండ్లు మళ్లీ ఆయన ముఖ్యమంత్రి కావడానికి ప్రయత్నం చేస్తున్నారని తెలిపారు. తొమ్మిదేండ్ల తర్వాత సీఎం కావడానికి తాను ప్రయత్నం చేస్తానన్నారు. ఆ క్రమంలో తన అప్లికేషన్ ప్రజల దగ్గర పెడతానని చెప్పారు. గురువారం హైదరాబాద్లోని గాంధీభవన్లో ఆయన విలేకర్లతో మాట్లాడారు. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రతి విషయాన్ని రాద్ధాంతం చేస్తున్నారని విమర్శించారు. ఆమె బీఆర్ఎస్లో ఉంటే ఏంటి? బయటకు వస్తే ఏంటని ప్రశ్నించారు. ఆమె మాటలు దెయ్యాలు వేదాలు వల్లించినట్టుగా ఉన్నాయని ఎద్దేవా చేశారు. తండ్రి వారసత్వం కొడుకుకే ఉంటుందనీ, ఒకవేళ కొడుకు లేకపోతే కూతురికి వచ్చే అవకాశం ఉంటుందని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.
రేవంత్ తర్వాత నేనే సీఎం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES