ఇప్పటివరకు వచ్చిన ప్రేమకథా చిత్రాలకు భిన్నంగా సోషియో ఫాంటసీ ప్రేమకథతో ‘దీర్ఘాయుష్మాన్ భవ’ చిత్రాన్ని తెరకెక్కించారు. కార్తీక్రాజు, మిస్తి చక్రవర్తి జంటగా ఎం.పూర్ణానంద్ దర్శకత్వం వహించారు. త్రిపుర క్రియేషన్స్ పతాకంపై వంకా యలపాటి మురళీకష్ణ నిర్మించారు. సెన్సార్ పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని జూలై 11న విడుదల చేస్తున్నట్లు నిర్మాత వంకాయలపాటి మురళీకష్ణ తెలిపారు. ‘చక్కటి ఫ్యామిలీ కథాశంతో రెండున్నర గంటలపాటు ప్రేక్షకులను అలరింపజేసే వినోదంతో ఈ చిత్రాన్ని తెరకెక్కించాం. సోషియో ఫాంటసీ కావడంతో గ్రాఫిక్స్కు ప్రాధాన్యం ఇచ్చాం. ఏ పాటకు ఆ పాట ఆహ్లాదభరితంగా ఉంటుంది. యూత్తో పాటు అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునేలా సినిమాని రూపొందించాం’ అని దర్శకుడు ఎం.పూర్ణానంద్ చెప్పారు.