- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : త్వరలో జరగబోయే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురవేయాలని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని తమ పార్టీ నేతలకు సూచించారు. నూతన రేషన్ కార్డులు, సన్న బియ్యం, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, వడ్డీ లేని రుణాలు, ఆర్టీసీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకాలను ఇంటింటా ప్రచారం చేయాలని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు.
- Advertisement -