Wednesday, September 24, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంతాల్‌ హెల్త్‌ఫెస్ట్‌ 2025కు రండి

తాల్‌ హెల్త్‌ఫెస్ట్‌ 2025కు రండి

- Advertisement -

కేటీఆర్‌కు ఆహ్వానం

నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
అమెరికాలో జరిగే ప్రతిష్టాత్మక తాల్‌ హెల్త్‌ఫెస్ట్‌ 2025కు ముఖ్య అతిథిగా హాజరు కావాలని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్‌కు ఆహ్వానం అందింది. ఈ మేరకు తాల్‌ హాస్పిటల్స్‌ సీఈఓ సాయి గుండవెల్లి కేటీఆర్‌ను కలిసి ఆహ్వానం అందజేశారు. ఈ సందర్భంగా ఉస్మానియా యూనివర్సిటీ మాజీ వైస్‌-ఛాన్సలర్‌ ప్రొఫెసర్‌ రవీందర్‌ యాదవ్‌ సాయి గుండవెల్లి వెంట ఉన్నారు. ఈ ఏడాది అక్టోబర్‌ 24న కాలిఫోర్నియాలోని యూనివర్సిటీ ఆఫ్‌ కాలిఫోర్నియా శాన్‌ డియాగోలో ఈ ‘హెల్త్‌ఫెస్ట్‌ 2025’ నిర్వహించనున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్య నిపుణులు, విధాన నిర్ణేతలు, ఆవిష్కర్తలు, మార్పు తీసుకొచ్చేవారిని ఒకే వేదికపైకి తీసుకు రానున్నారు. భవిష్యత్‌ ఆరోగ్య సంరక్షణపై చర్చించడమే ఈ సదస్సు ముఖ్య ఉద్దేశం.

ఈ సదస్సులో ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌, వ్యక్తిగత వైద్యం, డిజిటల్‌ హెల్త్‌కేర్‌ ఆవిష్కరణలు, సమీకృత వైద్య సంరక్షణ, ప్రపంచవ్యాప్తంగా మెరుగైన ఆరోగ్య సేవలకు మార్గాలు వంటి అంశాలపై విస్తతంగా చర్చిస్తారు. ఈ అంతర్జాతీయ కార్యక్రమంలో కేటీఆర్‌ కీలకోపన్యాసం ఇవ్వనున్నారు. తెలంగాణలో టెక్నాలజీ ఆధారిత పాలన, ఆవిష్కరణలతో కూడిన అభివృద్ధి, ఆరోగ్య రంగంలో తీసుకువచ్చిన విధానాలు ప్రపంచ ప్రజలకు ఎంతో విలువైనవిగా ఉంటాయని నిర్వాహకులు పేర్కొన్నారు. ఈ ఆహ్వానాన్ని కేటీఆర్‌ అంగీకరించినందుకు టచ్‌-ఎ-లైఫ్‌ ఫౌండేషన్‌ ధన్యవాదాలు తెలిపింది. హెల్త్‌ఫెస్ట్‌ 2025లో ఆయన భాగస్వామ్యం ఈ వేదికపై అర్థవంతమైన చర్చలకు దోహదపడుతుందని వారు ఆశాభావం వ్యక్తం చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -