- Advertisement -
నవతెలంగాణ-సిటీబ్యూరో
గ్రేటర్ హైదరాబాద్ నగరాన్ని మరింత పరిశుభ్రంగా మార్చే లక్ష్యంతో ఈ నెల 6 నుంచి జీహెచ్ఎంసీ చేపట్టిన ప్రత్యేక సానిటేషన్ డ్రైవ్ (ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమం) గురువారం పలు ప్రాంతాల్లో కొనసాగింది. మూడు రోజుల్లో నగరంలోని 695 కాలనీల్లో ప్రత్యేక పారిశుధ్య కార్యక్రమం అమలు చేశారు. ప్రత్యేక పారిశుధ్య కార్యక్రమాన్ని జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్, సానిటేషన్ అదనపు కమిషనర్ రఘు ప్రసాద్, జోనల్, డిప్యూటీ కమిషనర్లు పర్యవేక్షిస్తున్నారు. నగర వ్యాప్తంగా 1082.5 మెట్రిక్ టన్నుల చెత్త సేకరణ చేయగా, 365 మెట్రిక్ టన్నుల సీ అండ్ డీ వ్యర్థాలు తొలగించారు.
- Advertisement -