- Advertisement -
నవతెలంగాణ – కుభీర్
మండలంలోని పార్డి (కే ) గ్రామంలో హనుమాన్ మందిరంలో సోమవారం నుంచి సప్తమి వేడుకలు ప్రారంభమాయ్యాయి. ముందుగా హనుమాన్ పక్కనే ఉన్న శ్రీ రాజరాజేశ్వర ఆలయలను ముస్తాబు చేసి దేవత మూర్థులకు అభిషేకం చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ కమిటీ సభ్యులు సప్తమి వేడుకలను ప్రారంభించారు. ఈ వేడుకలు ఏడు రోజుల పాటు నిర్వహించి రాత్రి భజనలు కీర్తనలు నిర్వహిస్తారని ఆలయ కమిటీ నిర్వాహకులు తెలిపారు. చివరి రోజున ఉట్టి కొట్టె కార్యక్రమం నిర్వహించి వేడుకలు ముంగింపు చేయడం జరుగుతుంది.
- Advertisement -