అమెరికాలో తెలుగు విద్యార్థి దారుణ హత్య

నవతెలంగాణ హైదరాబాద్: అమెరికాలో మరో తెలుగు విద్యార్థి దారుణ హత్యకు గురయ్యాడు. బోస్టన్ యూనివర్సిటీలో ఇంజనీరింగ్ సెకండియర్‌ చదువుతున్న తెనాలికి చెందిన పరుచూరి అభిజిత్(20).. యూనివర్సిటీ క్యాంపస్‌లోనే హత్య చేయబడ్డాడు. ఈ నెల 11వ తేదీన యూనివర్సిటీ క్యాంపస్‌లో గుర్తుతెలియని వ్యక్తులు అభిజిత్‌ను హత్యచేసినట్టుగా తెలుస్తోంది. అయితే, సెల్ నంబర్ ఆధారంగా మృతదేహాన్ని అడవిలో గుర్తించారు. అమెరికా పోలీసులు.. ఇక, శుక్రవారం రాత్రి స్వస్థలం బుర్రిపాలెం గ్రామానికి అభిజిత్ మృతదేహాన్ని తరలించారు. అభిజిత్ మృతదేహాన్ని చూసి తల్లిదండ్రులు, బంధువులు బోరున విలపిస్తున్నారు. ఉన్నత ఆశయాలతో అమెరికా వెళ్లిన కుమారుడు.. ఇలా హత్యకు గురికావడంతో వారిని దుఖాన్ని ఆపడం ఎవరికి సాధ్యం కావడం లేదు.

Spread the love