అమెరికాలో భారత సంతతి యువకుడి దారుణ హత్య

నవతెలంగాణ – అమెరికా
అమెరికాలో ఓ భారత సంతతి యువకుడిని గుర్తుతెలియని వ్యక్తులు దారుణంగా హత్య చేశారు. బాధితుడు ఆదివారం ఆఫీసు నుంచి తిరిగొస్తుండగా ఇద్దరు గుర్తు తెలియని దోపిడీ చేసే క్రమంలో అతడిపై కాల్పులు జరిపి పొట్టన పెట్టుకున్నారు. ఫిలడెల్ఫియా నగరంలో ఈ దారుణం జరిగింది. మృతుడిని జూడ్ చాకోగా(21) గుర్తించారు. జూడ్ తల్లిదండ్రులు కేరళ వాస్తవ్యులు. 30 ఏళ్ల క్రితం వారు అమెరికాకు వలస వెళ్లారు. విద్యార్థి అయిన జూడ్ స్థానికంగా పార్ట్‌టైం ఉద్యోగం చేసేవాడు. మరోవైపు, ఈ ఘటనతో అమెరికాలోని భారతీయుల్లో ఆందోళన నెలకొంది. ఈ ఏడాది ఏప్రిల్ 21 ఆంధ్రప్రదేశ్‌కు చెందిన 24 ఏళ్ల విద్యార్థి దారుణ హత్యకు గురయిన విషయం తెలిసిందే. ఓహాయోలోని ఓ పెట్రోల్ బంక్‌లో పనిచేస్తున్న సాయీశ్‌ వీరాపై గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులకు తెగబడటంతో అతడు మరణించాడు.

Spread the love