వాహనం ఢీకొని గేదెకు తీవ్ర గాయాలు…

నవతెలంగాణ-మంథని
మంథని పట్టణ పరిధిలోని కూచిరాజు పల్లి శివారులో గుర్తు తెలియని వాహనం ఢీకొని ఓ గేదెకు తీవ్ర గాయాలయ్యాయి. అటువైపుగా వెళ్తున్న వార్డు కౌన్సిలర్ నక్క నాగేంద్ర శంకర్ వెంటనే స్పందించి ఆ గేదెను రోడ్డు పక్కకు తరలించారు. అనంతరం గేద యజమాని వివరాలు తెలుసుకొని వారికి సమాచారం అందించారు.దీంతో స్థానికులు వార్డు కౌన్సిలర్ ను అభినందిస్తున్నారు.

Spread the love