రెంజల్ మండలం నీళ్ల గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షుడు సోక్కుల సాయిలు సాటి మనిషిని కాపాడి మానవత్వాన్ని చాటుకున్నారు. బోధన పట్టణంలోని మురికి కాలువలు పడి కొట్టుమిట్టాడుతున్న సాటి మనిషిని చూసి మనస్సు చెల్లించి వెంటనే అతన్ని కాపాడడానికి మురికి కాలువలోకి దిగి అతని ఒడ్డుకు చేర్చారు. మురికి కాలువల పడి కొట్టుమిట్టాడుతున్న యువకుడిని ప్రధాన రహదారి వెంబడి వెళుతున్న జనాలు చూసి చూడనట్లు ప్రవర్తించగా, ఆయన మురికి కాలువలోకి ఆయనను కాపాడడం తన వంతు సహాయ సహకారాలు అందజేస్తున్నారు. సాటి మనిషి పై మానవత్వం చాటిన కాంగ్రెస్ నాయకులు మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు అభినందిస్తున్నారు.