సూర్య తేజ హీరోగా పరిచయం అవుతూ నటించిన చిత్రం ‘భరతనాట్యం’. ‘దొరసాని’ ఫేమ్ కెవిఆర్ మహేంద్ర దర్శకత్వం వహించారు. పిఆర్ ఫిలింస్ పతాకంపై పాయల్ సరాఫ్ నిర్మించారు. మీనాక్షి గోస్వామి కథానాయిక. వేసవి కానుకగా ఈనెల 5న విడుదలకు కానుంది. ఈ నేపథ్యంలో హీరో సూర్య తేజ ఏలే మీడియాతో పలు విశేషాలను షేర్ చేసుకున్నారు. మా నాన్న (ధని ఏలే) సినీ పరిశ్రమలో పాతికేళ్ళుగా పబ్లిసిటీ డిజైనర్గా పని చేస్తున్నారు. నేను పెయిటింగ్లో ఫైన్ ఆర్ట్స్, మాస్టర్స్ చేశాను. సినిమా టైటిల్స్ రాస్తుంటాను. డిజైనింగ్, ఎడిటింగ్లో అనుభవం ఉంది. కోవిడ్ తర్వాత రైటింగ్ లోకి వచ్చాను. నేను హీరో కావాలని అనుకోలేదు. డైరెక్షన్ చేయాలనే ఆసక్తి ఉండేది. ఈ క్రమంలో రచనపై ఆసక్తి ఏర్పడటంతో కథలు రాసుకున్నాను. ఈ కథల్ని పలువురికి నెరేట్ చేస్తూ స్ట్రగులింగ్లో ఉన్న సమయంలో హితేష్కి నేను చెప్పిన కథ నచ్చింది. తర్వాత దర్శకుడు కెవిఆర్ మహేంద్రకి కథ చెప్పాను. ఆయనకీ నచ్చింది. కథ రాసినప్పుడు నేను హీరోగా చేస్తానని అనుకోలేదు. నిజానికి ఇందులో నా పాత్ర ఏ కొత్త నటుడు చేసినా బాగుంటుంది. వినరు వర్మ దగ్గర యాక్టింగ్ కోర్స్ చేశాను. ఏడాది పాటు అన్నపూర్ణలో ఫిల్మ్ కోర్స్ చేశాను. అజరు ఘోష్, టెంపర్ వంశీ, వైవా హర్ష పాత్రలు రాసినప్పుడే వారినే అనుకున్నాను. వారి పాత్రలు చాలా డిఫరెంట్గా ఉంటాయి. డీవోపీ వెంకట్ చాలా అద్భుతమైన విజువల్స్ ఇచ్చారు. వివేక్ సాగర్ రావడంతో సినిమా స్కేల్ మరింతగా పెరిగింది. ఇది ఫిక్షనల్ స్టోరీ. కానీ రియల్ లైఫ్తో రిలేట్ చేసుకునేలా ఉంటుంది. ఒక మనిషి షార్ట్ కట్లో వెళితే ఏం జరుగుతుందనేది ఈ సినిమా పాయింట్. పర్శనల్గా ఫీలైన స్ట్రగుల్స్ని కామికల్గా చేసి రాశాను. కమర్షియల్గా చాలా మంచి ఎంటర్టైనర్. ఈ కథకు ‘భరతనాట్యం’ పర్ఫెక్ట్ టైటిల్. అది ఎలా అనేది సినిమా చూస్తున్నపుడు తెలుస్తుంది. ఇందులో అన్ని పాత్రలు సమానంగా ఉంటాయి. హీరోయిన్ పాత్ర మాత్రం కథలో కీలక పాత్ర పోషిస్తుంది. ఇది ఫ్యామిలీ అంతా కలసి చూసేలా ఉంటుంది. నిర్మాతలు హితేష్ పాయల్ ఇచ్చిన సపోర్ట్ మర్చిపోలేను. ఎక్కడా రాజీపడకుండా మంచి ప్యాడింగ్, ప్రొడక్షన్ వాల్యూస్తో నిర్మించారు. సినిమా చాలా అద్భుతంగా వచ్చింది. వివేక్ సాగర్ ట్రెండీ ఆర్ఆర్ ఇచ్చారు. ఈ స్కేల్ సినిమా తీసినందుకు చాలా ఆనందంగా ఉంది. ఫస్ట్ కాపీ చూసిన తర్వాత ఈ సినిమా విషయంలో మా నాన్న చాలా ఆనందంగా ఉన్నారు. ఈ సినిమాని అందరూ ఆదరిస్తారనే నమ్మకంతో ఉన్నాం.