సౌబిన్ షాహిర్, గణపతి, ఖలీద్ రెహమాన్, శ్రీనాథ్ భాసి ప్రధాన పాత్రలలో చిదంబరం ఎస్ పొదువల్ దర్శకత్వం వహించిన మలయాళ సర్వైవల్ థ్రిల్లర్ ‘మంజుమ్మల్ బాయ్సు’. మలయాళంలోనే రూ.200 కోట్లకు పైగా గ్రాస్తో ఈ సంవత్సరం ఇండియాలో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాలలో ఒకటిగా నిలిచింది. పాన్ ఇండియా ప్రొడక్షన్ హౌస్ మైత్రీ మూవీ మేకర్స్ తెలుగు ప్రేక్షకులకు ముందు ఈ సర్వైవల్ థ్రిల్లర్ను తీసుకువస్తోంది. తెలుగు వెర్షన్ను నవీన్ యెర్నేని, రవిశంకర్ యలమంచిలి సమర్పిస్తున్నారు. ఈనెల 6న తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా విడుదల కానుంది. తాజాగా తెలుగు ట్రైలర్ను విడుదల చేశారు మేకర్స్. డేవిల్స్ కేవ్గా పిలవబడే గుణా కేవ్స్కి కొంతమంది స్నేహితులు వెళ్తారు. ఆ గుహలోకి వెళ్లిన స్నేహితుల్లో ఒకడు అనుకోకుండా ఒక లొతైన గుంతలో పడిపోతాడు? ఆ స్నేహితుడ్ని బతికించుకోవడం కోసం ఆ స్నేహితులు ఏం చేశారనేది సినిమా అని మేకర్స్ తెలిపారు.