జుక్కల్ లో మద్యం పట్టి వేత.

నవతెలంగాణ- జుక్కల్: మండలంలోని జుక్కల్  పోలీస్ స్టేషన్ ముందు పోలీస్ ఆకస్మీకంగా చెకింగ్ లో బాగంగా మద్యం పట్టుకోనడం జర్గింది. జుక్కల్ ఎస్ఐ సత్యనారాయణ తెలిపిన వివరాల ప్రకారం మద్నూర్ మండలం అంతాపూర్ గ్రామానికి చెందిన డి. అజయ్ జుక్కల్  నుండి ఇరువై ఐడు లీటర్ల విస్కీ ని తనిఖీలు చేపడుతుండగా అనుమానస్పదంగా అజయ్ ద్విచక్ర వాహనం పైన తరలిస్తున్న  క్రమంలో   మద్యం పట్టుకున్నామని, దాని విలువ  ఇరువై ఏడు వేల రూపాయల విలువ ఉంటుందని తెలిపారు. కేసు నమేాదు చేసి దర్యాప్తు చేస్తున్నామని అన్నారు. తనీఖీలలో  ఎస్సైతో పాటు పోలీసు సిబ్బంది తదితరులు పాల్గోన్నారు.

Spread the love